రమణ మహర్షి ఆలయంలో 75వ ఆరాధన పూజలు | - | Sakshi
Sakshi News home page

రమణ మహర్షి ఆలయంలో 75వ ఆరాధన పూజలు

Apr 27 2025 1:00 AM | Updated on Apr 27 2025 1:00 AM

రమణ మ

రమణ మహర్షి ఆలయంలో 75వ ఆరాధన పూజలు

వేలూరు: తిరువణ్ణామలైలోని రమణ మహర్షి ఆలయంలో 75వ ఆరాధన పూజలు శనివారం అతి వైభవంగా జరిగాయి. తిరువణ్ణామలైలోని భగవాన్‌ రమణ మహర్షికి భక్తులు నేటికి ఆయన ఉనికిని గుర్తు చేసుకునే విధంగా ప్రత్యేక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తున్నారు. అందులో భాగంగా ఉదయం ఆయన విగ్రహానికి ప్రత్యేక పుష్పాలంకరణలు దీపారధన పూజలు చేసి మంగళ హారతి పూజలు చేశారు. అనంతరం మహాన్యాస రుద్రజపం, విశేష పారాయణం, అభిషేకాలు చేశారు. భక్తులు స్వామికి పూల మాలలు, తాల పత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక ఆరాధన పూజలు చేశారు. ఈ ఆరాధన పూజలను ఉదయం నుంచి సాయంత్రం వరకు పత్యక్ష ప్రసారం చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు వీటిని వీక్షించారు. గురువు భౌతిక రూపం కాదు. అందువల్ల అతని శరీరం అదృశ్యమైన తర్వాత కూడా గురువుతో సంబంధం కొనసాగుతుందని అని ఆయన చెప్పారని, భగవంతుడు మనలోనే ఉన్నారని మన ఆత్మగా ఎక్కడా వెలగని వెలుగు ఆయన జ్ఞానాన్ని, శాశ్వతత్యాన్ని కొరుకునే వారుగా అతను అనే మాటలు భక్తులకు అవగాహన కల్పించారు. ఈ ఆరాధన పూజల్లో భక్తులకు అన్నదానం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.

రమణ మహర్షి ఆలయంలో 75వ ఆరాధన పూజలు 1
1/1

రమణ మహర్షి ఆలయంలో 75వ ఆరాధన పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement