
ఘనంగా ఓయూవీ శర్మ అభినందన సభ
కొరుక్కుపేట: సదరన్ రైల్వేలో 40 ఏళ్లుగా పనిచేసిన ఓ. యు.వీ . శర్మ పదవి విరమణ సంబదర్భంగా ఘనంగా సత్కరించారు . చైన్నె ఎగ్మోర్లోని రైల్వే కన్స్ట్రక్షన్ హాలు వేదికగా గురువారం జరిగిన కార్యక్రమంలో రైల్వేకు చెందిన ఉన్నతాధికారులు నారాయణన్, దినకరన్, జయరామన్ , రవ్రీంద సింగ్ రాజ్ పాల్ తదితరులు పాల్గొని ఓయూవీ శర్మ సేవలను ప్రశంసిస్తూ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో క్రమశిక్షణతో సేవలను అందించారని రైల్వే అడ్మినిస్ట్రేషన్ నుంచి అనేక అవార్డులను అందుకున్నారని గుర్తు చేశారు.