
శ్రీలంక తమిళ కవి జీవిత చరిత్రతో ఆంగ్ల నవల
తమిళసినిమా: శ్రీలంకకు చెందిన ఓ తమిళ కవి ప్రపంచ ఖ్యాతిని గాంచారు. ఈయన పేరు పొట్టువిల్ అస్మిన్. ఈయన విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన నాన్ చిత్రంలో తెప్పెల్లామ్ తప్పే ఇలై అనే పాట ద్వారా సినీ గీత రచయితగానూ పరిచయం అయ్యారు. కాగా పొట్టువిల్ అస్మిన్ గత 27 ఏళ్లుగా కళలు, సాహిత్యం, మీడియా, సినిమా రంగాల్లో విశేష సేవలందిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి జ్ఞాపకార్థం గీత రచయిత వైరముత్తు రచించిన కలైంజ్ఞర్ 100 కవితైగళ్ 100 అనే ప్రతిష్టాత్మక సంకలనంలో కూడా పొట్టువిల్ అస్మిన్ కవితలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత రాసిన వానే ఇడిందదమ్మా అనే నివాళి గీతం ఆమె సమాధి వద్ద రెండు నెలల పాటూ మారుమోగింది. అదే విధంగా ఈయన రాసిన అయ్యో సామి నీ ఎనక్కు వేణామ్ అనే పాటు బహుళ ప్రాచుర్యం పొందింది. పొట్టువిల్ అస్మిన్ పాటతో శ్రీకాంత్దేవా సంగీతంలో ముల్లై శశి పాడిన ముట్టక్కణ్ని అనే వీడియో ఆల్బమ్కు అమెరికాలోని అంతర్జాతీయ గీత రచయితల సంఘం 2025వ సంవత్సరానికి గానూ ఉత్తమ గీత రచయిత అవార్డుకు ఎంపిక చేశారు. ఇలా పలు జాతీయ ,అంతర్జాతీయ అవార్డులను పొందిన పొట్టువిల్ అస్మిన్ జీవిత చరిత్రను పొట్టువిల్ అస్మిన్ ఫ్రమ్ పొట్టువిల్ టూ ద వరల్డ్– ఏ గ్లోబల్ తమిళ్ వాయిస్ పేరుతోఅమేజాన్ కై ండ్లీ సంస్థ ఇటీవల ప్రసారం చేసింది. కాగా అదేపేరుతో ఈయన జీవిత చరిత్రతో రూపొందిన ఆంగ్ల నవలను ఇటీవల చైన్నెలో లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లైకా హెల్త్ సంస్థ నిర్వాహక అధ్యక్షురాలు డా.ప్రేమా సుభాస్కరన్, లైకా ప్రొడక్షన్స్ నిర్వాహకుడు జీకేఎం తమిళకుమరన్ పాల్గొన్నారు.