చైన్నెలో ఆటోడ్రైవర్ల నిరసన | - | Sakshi
Sakshi News home page

చైన్నెలో ఆటోడ్రైవర్ల నిరసన

Apr 24 2025 1:35 AM | Updated on Apr 24 2025 1:35 AM

చైన్నెలో ఆటోడ్రైవర్ల నిరసన

చైన్నెలో ఆటోడ్రైవర్ల నిరసన

– 400 మంది అరెస్టు

కొరుక్కుపేట: చైన్నెలో బైక్‌ ట్యాక్సీలను నిషేధించాలని, మీటర్‌ చార్జీలను నిర్ణయించి, ఆటో యాప్‌లను వెంటనే అమలు చేయాలని కోరుతూ చైన్నెలో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరిండడంతో ఆటో యూనియన్లు చేపాక్కం శివానంద రోడ్డులో ఆందోళనకు దిగారు. యూనియన్‌ సమన్వయ కర్త బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో 300 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆటోలతో అక్కడికి చేరుకున్నారు. పెరియార్‌ విగ్రహం నుంచి సెక్రటరీయేట్‌ వైపు ఊరేగింపుగా ప్రారంభించిన ఆటో డ్రైవర్లును దూరదర్శన్‌ స్టేషన్‌ సమీపంలో పోలీసుల అడ్డుకున్నారు. వెంటనే రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ గుమిగూడిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి బస్సుల్లో తీసుకెళ్లారు. అలాగే సైదాపేటలోని పనగల్‌ హౌస్‌ దగ్గర జరిగిన నిరసనలో 100 మందికి పైగా ఆటో కార్మికులను అరెస్టు చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు . దీంతో పోలీసులు , ఆటో కార్మికుల మద్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement