
తిరుచ్చి డివిజన్లో విస్తృతంగా రైల్వే పనులు
సాక్షి, చైన్నె: దక్షిణ రైల్వే పరిధిలోని తిరుచ్చి రైల్వే డివిజన్లో వివిధలోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తయిన , కొనసాగుతున్న కీలక అభివృద్ది పనులను ఎంపీలు బుధవారం అధ్యయనం చేశారు.ఎస్. కళ్యాణసుందరం (రాజ్యసభ), వైద్యలింగం (పుదుచ్చేరి లోక్సభ నియోజకవర్గం),ఎం. షణ్ముగం (రాజ్యసభ), దురై వైకో (తిరుచ్చి లోక్సభ నియోజకవర్గం),ఎస్. మురసోలి (తంజావూరు లోక్సభ నియోజకవర్గం), అరుణ్ నెహ్రు (పెరంబలూరు లోక్సభ నియోజకవర్గం), సుధా (మైలాడుతురై లోక్సభ నియోజకవర్గం) డాక్టర్ ఎం.కె. విష్ణు ప్రసాద్ (కడలూరు లోక్సభ నియోజకవర్గం), సిఎన్ అన్నాదురై (తిరువణ్ణామలై లోక్సభ నియోజకవర్గం)వి. సెల్వరాజ్ (నాగపట్నం లోక్సభ నియోజకవర్గం) డా. డి. రవికుమార్ (విల్లుపురం లోక్సభ నియోజకవర్గం)ల ఎంపీలతో జరిగిన సమావేశంలో దక్షిణ రైల్వే జీఎం ఆర్ఎన్ సింగ్ ,తిరుచ్చి డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం.ఎస్. అన్బళగన్, దక్షిణ రైల్వే ప్రధాన విభాగ అధికారులు తిరుచ్చి జోన్లో జరుగుతున్న పనులను వివరించారు. పూర్తయిన, జరుగుతున్న, చేపట్టనున్న ప్రాజెక్టులను విశదీకరించారు. ఈసందర్భంగా కొత్త రైళ్ల పరిచయం, అదనపు స్టాప్ల ఏర్పాటు, కొత్త రైల్వే లైన్ నిర్మాణాల పురోగతి, ఉన్న సేవల పొడిగింపులు, స్టేషన్ అభివృద్ధి, డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిల నిర్మాణం, ప్రయాణికుల సౌకర్యాల మెరుగు, రైల్వే ప్రాజెక్టుల కోసం భూసేకరణ వంటి వివిధ అంశాలపై ఎంపీలు చర్చించారు.