ఉల్లాసంగా..ఉత్సాహంగా | - | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా..ఉత్సాహంగా

Apr 3 2025 1:56 AM | Updated on Apr 3 2025 1:56 AM

ఉల్లాసంగా..ఉత్సాహంగా

ఉల్లాసంగా..ఉత్సాహంగా

● జంబుకేశ్వర ఆలయ ఏనుగు జలకాలాట ● వేసవి తాపం తగ్గేందుకు ప్రత్యేక ఏర్పాట్లు

సేలం: వేసవి వేడి తగ్గేందుకు ఏర్పాటు చేసిన కొలనులో జంబుకేశ్వర ఆలయ ఏనుగు ఉల్లాసంగా ఉత్సాహంగా జలకాలాడుతోంది. ఈ ఏడాది రాష్ట్రంలో మార్చి చివరి నుంచే వేసవి వేడి ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో తిరుచ్చిలో గత రెండు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రత 104 డిగ్రీలు నమోదు కావడంతో, వేసవి వేడిమి, వడదెబ్బతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్న ఈ పరిస్థితిలో, పక్షులు, జంతువులు సహా వివిధ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కాగా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల్లో ప్రముఖమైనది తిరుచ్చిలోని తిరువనైక్కవల్‌ జంబుకేశ్వరర్‌ ఆలయం. ఇందులో అఖిల అనే ఏనుగు 2011 నుంచి సేవ చేస్తోంది. ఈ ఆలయంలో కావేరి నది నుంచి ఒక ఏనుగు నీటిని తీసుకొచ్చి శివుడిని పూజించిందని చరిత్రలో చెప్పబడింది. ఈ కారణంగా ప్రతి కాలపూజ సమయంలో ఆలయ ఏనుగు అఖిల తీసుకొచ్చే పవిత్ర జలంతో శివుడికి అభిషేకం చేస్తారు. ఏనుగులు నీటిని చూసినప్పుడు సహజంగానే ఉత్సాహంగా ఉంటాయి, జంబుకేశ్వరర్‌ ఆలయ సముదాయంలోని నాచియార్‌ గ్రోవ్‌ ప్రాంతంలో 20 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు గల చుట్టుపక్కల గోడతో స్నానపు తొట్టిని నిర్మించారు. ఎండ తీవ్రత పెరిగిన స్థితిలో ఆలయ ఏనుగు అఖిలకు వేసవి తాపం తగ్గే రీతిలో ఏర్పాటు చేసిన ఈ తొట్టెలో ఉల్లాసంగా ఉత్సాహంగా జలకాలాడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement