పొరపాటున ఎమర్జెన్సీ డోర్‌ తెరిచిన ప్రయాణికుడు | - | Sakshi
Sakshi News home page

పొరపాటున ఎమర్జెన్సీ డోర్‌ తెరిచిన ప్రయాణికుడు

Feb 15 2024 1:12 AM | Updated on Feb 15 2024 1:12 AM

కొరుక్కుపేట: విమానం రన్‌వేపై ఎగిరేందుకు సిద్ధమైన సమయంలో పొరపాటున ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ తెరవడం కలకలం రేపింది. వివరాలు.. చైన్నె విమానాశ్రయంలోని స్వదేశీ టర్మినల్‌ నుంచి న్యూఢిల్లీకి మంగళవారం రాత్రి ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ విమానం 159 మంది ప్రయా ణికులతో బయలుదేరేందుకు సిద్ధమైంది. విమానం రన్‌వేపై వెళ్తుండగా ఎమర్జెన్సీ డోర్‌ తెరుచుకోవడంతో అలారం మోగింది. దీంతో పైలెట్‌ విమానం నిలిపివేశారు. ఎమర్జెన్సీ డోర్‌ కూర్చున్న ప్రయాణికుడు పొరపాటున సమీపంలోని బటన్‌ నొక్కడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

గంట ఆలస్యంగా ఢిల్లీకి బయలుదేరిన విమానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement