
● సేద్యానికి, చదువులకూ ఒకేసారి ఖర్చులు ● రైతులు, సామాన్
బడులు అవసరమవుతాయి. ఏ పంట వేయాలన్నా తొలినాళ్లలోనే ఎకరాకు తక్కువలో తక్కువ రూ.20 వేలు ఖర్చు చేయాల్సిందే. దీంతో పెట్టుబడుల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు అన్నదాతలు.
చదువులకు ఖర్చు ఎక్కువే..
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 90 వేల మంది, గురుకుల పాఠశాలల్లో 10వేల మంది విద్యార్థులు చదువుతుండగా, 50 వేల మంది పైచిలుకు విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. ఇతర ప్రాంతాల్లోని ప్రైవేటు, కార్పోరేట్ విద్యా సంస్థల్లో మరో వేల 20వేల మంది వరకు చదువుతున్నట్లు అంచనా. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం, బ్యాగులు, షూస్ కోసం కనిష్టంగా రూ.10వేలు వరకు ఖర్చు చేయాల్సిందే. రూ.20వేల నుంచి రూ,50వేల వరకు ఫీజులు కోసం వెచ్చించాల్సిన పరిస్థితి. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.50వేలకు పైబడి ఖర్చు ఉంటుంది. ఇక, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు 65 వేల మంది ఉన్నారు. వీరంతా ఉన్నత విద్య కోసం రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది.
అప్పులు చేయాల్సిందే..
ఏటా జూన్లో పంటల సాగు, పిల్లల చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఏకకాలంలో రెండు రకాల ఖర్చులు భారంగా మారాయి. అవసరమైన సమయంలో బ్యాంకుల్లో రుణాలు లభించని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. ఎక్కువ వడ్డీలు కూడా పేద, మద్య తరగతి వర్గాలకు ఇబ్బందికరంగా తయారవుతోంది. ఏది ఏమైనా జూన్ నెల గట్టెక్కడం సామాన్యుడికి సవాల్ అనే చెప్పాలి.
అందని పథకాల సొమ్ము..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల రూపంలో దాదాపు ప్రతి నెలా ఏదో ఒక రూపంలో ప్రజలకు డబ్బులు ఖాతాల్లో జమయ్యేవి. అవి స్కూల్, వ్యవసాయం, ఇతర ఖర్చులకు ఆసరాగా నిలిచేవి. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన పథకాలతో ఠంఛనుగా చెప్పిన తేదీకే తల్లిదండ్రుల ఖాతాల్లో సొమ్ము జమా అయ్యేది. దీంతో పేద, మధ్య తరగతికి చెందిన ప్రజలు తమ పిల్లల్ని దర్జాగా చదివించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకాలకు పంగనామాలు పెట్టేసింది. గత ప్రభుత్వం ఐదేళ్లలో అమ్మఒడి పేరిట రూ.1298.51 కోట్లు తల్లులు ఖాతాల్లో వేస్తే, కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క పైసా విదల్చలేదు. దీంతో 2.10 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచారంగా మారింది. ఉన్నత విద్య చదువుతున్న 65 వేల మంది విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది.
రైతన్నకు తిప్పలు..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లాలోని రైతు భరోసా పథకం ద్వారా 18.19 లక్షల ఎకరాల భూమికి పెట్టుబడి సాయం, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు డాక్టర్ వై.ఎస్.ఆర్ ఉచిత పంటల బీమా పథకంతో ఆదుకునేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ‘అన్నదాత సుఖీభవ’ పథకం కిం
ఇచ్ఛాపురం రూరల్:
పిల్లలు బడి బాట.. పెద్దలు పొలంబాట పట్టే సమయం ఆసన్నమైంది. దీంతో అందరిలోనూ ‘జూన్’ గుబులు ప్రారంభమైంది. వ్యవసాయంలో పెట్టుబడులు ఎంత అవసరమో, పిల్లల చదువులకూ అంతకన్నా ఎక్కువే అవసరమవుతోంది. రెండింటికీ ఒకే సమయంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితుల్లో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో వ్యవసాయంలో పెట్టుబడులు పెరగడం, చదువులకు సంబంధించిన ఫీజులు, ఇతర ఖర్చులు కూడా పెరిగి జూన్ ఎలా గట్టెక్కేదని ఆవేదన చెందుతున్నారు. గత వైఎస్సార్ సీసీ ప్రభుత్వంలో రైతుభరోసా, అమ్మఒడి వంటి పథకాలు సకాలంలో అందడంతో ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కేవి. ఇప్పుడా పరిస్థితి లేదు.
పెరిగిన సాగు ఖర్చులు..
జిల్లాలో మెజారిటీ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో ఎడ్లు నాగల్లతో దుక్కిదున్నేవారు. ప్రస్తుతం 90 శాతానికి పైగా రైతులు ట్రాక్టర్లనే వినియోగిస్తున్నారు. దీంతో దుక్కి దున్న డం నుంచి విత్తనం వేసే వరకు ఖర్చు రెట్టింపవుతోంది. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు పెట్టు

● సేద్యానికి, చదువులకూ ఒకేసారి ఖర్చులు ● రైతులు, సామాన్

● సేద్యానికి, చదువులకూ ఒకేసారి ఖర్చులు ● రైతులు, సామాన్

● సేద్యానికి, చదువులకూ ఒకేసారి ఖర్చులు ● రైతులు, సామాన్

● సేద్యానికి, చదువులకూ ఒకేసారి ఖర్చులు ● రైతులు, సామాన్