
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
కొత్తూరు/సరుబుజ్జిలి: జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై ఇద్దరు మృత్యువాతపడ్డారు. కొత్తూరు మండలం ఆకులతంపర కాలనీకి చెందిన పెయ్యల సింహాచలం(79) శనివారం కాలనీ సమీపంలో ఉన్న పొలాల్లోకి మేకలను మేతకు తీసుకెళ్లాడు. ఇంతలో వర్షం కురవడంతో చింతచెట్టు కిందకు చేరుకున్నాడు. ఇంతలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు సర్పంచ్ నాగళ్లు అప్పన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎండీ అమీర్ ఆలీ కేసు నమోదు చేశారు. సింహాచలంకు భార్య పున్నమ్మ, వివాహమైన ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే విధంగా, సరుబుజ్జిలి మండలం బుడ్డివలసకు చెందిన బూరాడ అప్పలనాయుడు(54) పొలం పనులకు వెళ్లగా పిడుగుపాటుకు కుప్పకూలిపోయాడు. స్థానికులు స్పందించి పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతిచెందాడు. అప్పలనాయుడుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

పిడుగుపాటుకు ఇద్దరు మృతి