
అప్పులు చేసి చదివిస్తున్నాం
జగనన్న ప్రభుత్వ హయాంలో ప్రతి ఏడాది పిల్లల చదువుకు సంబంధించి అమ్మ ఒడి పథకం ద్వారా నేరుగా మా ఖాతాలో జమ అయ్యేది. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం ద్వారా సొమ్ము ఇస్తామన్నారు. నేటికి ఏడాది అవుతున్నా నయా పైసా కూడా ఇవ్వలేదు. రోజురోజుకు పెరుగుతున్న బడ్జెట్ కారణంగా పిల్లల్ని చదివించుకునేందుకు సగటు మధ్యతరగతి ప్రజలు అప్పులు చేయాల్సి వస్తోంది.
– దున్న జ్యోతి, బూర్జపాడు,
ఇచ్ఛాపురం మండలం
ద ప్రతీ ఏడాది రూ.20వేలు ఇస్తామంటూ ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. దీంతో ఏడాది నుంచి అన్నదాతలు అప్పులు చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నారు. వ్యవసాయం కోసం తలకు మించి అప్పులు చేసి కొంత మంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.