
ట్యాబ్ ఇక గతమే..
ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విద్యను చేరువ చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసింది. 2022 డిసెంబర్ 21న 25,953 ట్యాబ్లు, 2023 డిసెంబర్ 21వ తేదీన 25,289 ట్యాబ్లు అందజేసింది. ఇందులో అత్యంత విలువైన బైజూస్ కంటెంట్ కలిపి ఉండేది.
కూటమి వచ్చాక డిజిటల్ విద్య ఊసే లేదు. వారు ప్రతిపక్షంలో ఉండగా ‘మీరు ట్యాబ్లు ఇచ్చారు.. మేమొస్తే అంతకుమించి ఇస్తామ’ని గొప్పలు చెప్పినా ఒక్క ట్యాబ్ కూడా ఇవ్వలేకపోయారు.