
తల్లికి వందనం ఎప్పుడో..?
ఒక తేదీ చెప్పి ఆ తేదీకి అమ్మ ఒడిని ఠంచనుగా గత ప్రభుత్వం వేసేది. ఐదేళ్లలో ఇలా రూ.1298.51 కోట్లు విద్యార్థుల ఖాతాలో జమ చేసింది. విద్యార్థులు, వారి తల్లుల ఖాతాల వివరాలు అన్నీ సర్కారు వేలి కొసనపైనే ఉన్నాయి. అయినా తల్లికి వందనం వేయడానికి కూటమికి తీరిక దొరకడం లేదు. విద్యా సంవత్సరం అయిపోయి చాలా మంది స్కూళ్లు, కాలేజీల నుంచి రిలీవైపోయినా.. ఇంకా తల్లికి వందనం ఇవ్వలేదు.
జిల్లాలో ఒకటి నుంచి ఇంటర్(+2) వరకు 2.10లక్షల మంది చదువుతున్నారు. వీరిందరికి కలిపి మొదటి ఏడాది రూ.315 కోట్ల నిధులను కూటమి ప్రభుత్వం బాకీ పడింది.