
● ఉత్సాహంగా యోగాంధ్ర
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని చారిత్రక డచ్ బిల్డింగ్ వద్ద యోగాంధ్ర–2025 కింద యోగా శిబిరం మంగళవారం ఉదయం జరిగింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆధ్వర్యంలో అధికారులు సమన్వయంతో నిర్వహించారు. వెయ్యిమంది హా జరు కావడానికి వీలుగా పది విభాగాలుగా విభజించారు. ప్రతి బ్లాకు ఎదుట ఒక యోగా గురు వును ఏర్పాటు చేశారు. మొత్తం 45 మంది యోగా గురువులు శిబిరాన్ని విజయవంతంగా నడిపించా రు. మాజీ సైనికులు కూడా భాగస్వాములయ్యారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటే శ్వరరావు, ఆయుష్ కోఆర్డినేటర్ డాక్టర్ జగదీష్, సెట్శ్రీ సీఈఓ ప్రసాదరావు, జిల్లా టూరిజం అధికారి నారాయణరావు, డీఎంహెచ్ఓ అనిత యోగా శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు.