
హైకోర్టు ఆదేశించినా పాటించరా..?
పలాస: మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావుతో పాటు మిగతా వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడంపై పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరం వద్ద సోమవారం వివిధ ప్రజాసంఘాలకు చెందిన నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. హైకోర్టు తీర్పు చెప్పినా.. ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు బేఖాతరు చేస్తూ నంబాల కేశవరరావు మృత దేహాన్ని వారి కుటుంబానికి అప్పగించక పోవడం చాలా అన్యాయమని, ప్రజాస్వామిక వాదులు, పౌర సమాజం దీనిపై స్పందించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు పత్తిరి దానేసు, దాసరి శ్రీరాములు, జోగి కోదండరావు, వంకల మాధవరావు,పుచ్చ దుర్యోధన, మద్దిల ధర్మారావు, మద్దిల రామారావు, కోనేరు గురయ్య, సాలిన వీరాస్వామి, పోతనపల్లి కుసుమ తదితరులు ఉన్నారు.