
నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు
నరసన్నపేట: వైఎస్సార్ సీపీ నాయకు డు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేయడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం ధర్మా న కృష్ణదాస్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేక ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కు తెగబడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మె ల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరులు వెంకట్రామిరెడ్డిలపై కూడా తప్పుడు కేసులు బనాయించారని మండిపడ్డారు. వీరిపై జంట హత్యల కేసు నమోదు చేయడంతో రెడ్బుక్ రాజ్యాంగం పరాకాష్టకు చేరిందన్నారు. ఇంత దారుణమైన పాలన గతంలో ఎప్పుడూ రాష్ట్రంలో లేదని, ఇలాంటి అరాచక పాలన కూటమి నాయకులకే చెల్లిందని విమర్శించారు. కూటమి నాయకులకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
ధర్మాన కృష్ణదాస్