
కార్యకర్తలకు తోడుగా ఉంటా
మహిళలకు రక్షణ కరువు
బుక్కరాయసముద్రం/శింగనమల: చంద్రబాబు ఏడాది పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజలకు చేసిన మోసాలను లెక్కలతో సహా వివరిద్దామని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రెడ్బుక్ మాటున సాగిస్తున్న అరాచకాలకు, బెదిరింపులకు భయపడేది లేదన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. శింగనమల నియోజకవర్గానికి సంబంధించి బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఇదే వేదిక నుంచి ‘రీ కాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిఽథున్రెడ్డి, అనంతపురం, హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్ కుమార్రెడ్డి, రమేష్రెడ్డి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఉషశ్రీచరణ్, నియోజకవర్గ సమన్వయకర్తలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, తలారి రంగయ్య, ఈరలక్కప్ప, దీపిక, మక్బుల్ అహ్మద్, దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, అధికార ప్రతినిధి ఎంపీ గోరంట్ల మాధవ్, పీఏసీ సభ్యులు మాలగుండ్ల శంకరనారాయణ, మహాలక్ష్మి శ్రీనివాస్, అనంతపురం మేయర్ వసీం, టాస్క్ఫోర్స్ సభ్యుడు రమేష్ గౌడ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల నాయక్, రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు పెన్నోబిలేసు, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి కృష్ణవేణి, పార్టీ అనంతపురం నగర అధ్యక్షుడు సోమశేఖర్రెడ్డి హాజరయ్యారు. ముఖ్య అతిథులకు తహసీల్దార్ కార్యాలయం వద్ద నాయకులు స్వాగతం పలికారు. అక్కడే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీ జెండా అవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి సిద్దరాంపురం రోడ్డు మీదుగా వైఎస్సార్సీపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సక్రమంగా నెరవేర్చలేదన్నారు. ప్రజలను మోసగించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలందరికీ గుర్తు చేయడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. 2019–24 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. 5 ఏళ్ల పాలనతో జగనన్న రాష్ట్రాన్ని పదేళ్లు ముందుకు తీసుకెళితే చంద్రబాబు ప్రస్తుత ఏడాది పాలనలో రాష్ట్రాన్ని 15 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్పర్సన్ నాగరత్నమ్మ, జెడ్పీటీసీలు భాస్కర్, భోగాతి ప్రతాప్రెడ్డి, నాయకులు నరేష్, సర్పంచ్ పార్వతి, పూల నారాయణస్వామి, నందినేని మల్లికార్జున, గువ్వల శ్రీకాంత్రెడ్డి, నారాయణరెడ్డి, రాజశేఖర్రెడ్డి, బొమ్మన శ్రీరామిరెడ్డి, తరిమెల వంశీ గోకుల్రెడ్డి, నార్పల సత్యనారాయణరెడ్డి, రఘనాథరెడ్డి, ముత్యాల శీనా, పురుషోత్తం, పెద్ద కొండయ్య, చికెన్ నారాయణస్వామి, శ్రీనివాస రెడ్డి, ఆది, తదితరులు పాల్గొన్నారు.
అరాచకాలను తిప్పికొట్టాలి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలామంది బాలికలు మిస్సింగ్ అవుతున్నా మహిళా పక్షపాతి అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం నోరుమెదపరన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాలికలపై అత్యాచారాలు జరిగితే సీఎం, హోంమంత్రి, డిప్యూటీ సీఎం కానీ పరామర్శించిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు చేపట్టకపోయినా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
హామీల అమలులో ఘోరంగా విఫలం
బెదిరింపులు, కేసులకు భయపడేది లేదు
వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల
వైఎస్సార్సీపీ కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక అధికార పార్టీ నాయకులు రెడ్బుక్ మాటున అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. టీడీపీ వారు ఇసుక, ఎర్రమట్టి, రేషన్ బియ్యం దందా కోసం కొట్టుకుచస్తున్నారన్నారు. నాణ్యమైన చదువు, నాణ్యమైన మందులు, నాణ్యమైన భోజనం ఇస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రులను చూశాం కానీ.. నేడు నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తున్నామన్నారు.
వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడడం పిరికిపంద చర్య అని రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి ఖండించారు. అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు అండగా ఉంటామన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వాటిని ఏమాత్రం పట్టించు కోకుండా చంద్రబాబు నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు అవినీతి అక్రమాల్లో మునిగిపోయారన్నారు. హామీలు అమలు చేయకుంటే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

కార్యకర్తలకు తోడుగా ఉంటా

కార్యకర్తలకు తోడుగా ఉంటా

కార్యకర్తలకు తోడుగా ఉంటా