వైద్యం పడకేసింది | - | Sakshi
Sakshi News home page

వైద్యం పడకేసింది

May 30 2025 1:20 AM | Updated on May 30 2025 6:01 PM

ఉమ్మడ

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రాథమిక వైద్యం పడకేసింది. కూట

ఊటుకూరు పీహెచ్‌సీ ఏర్పాటై దాదాపు మూడేళ్లు గడుస్తోంది. విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌లో వైద్యులు సేవలందిస్తున్నారు. ఇందులో మరుగుదొడ్డి, వాష్‌రూమ్‌, తాగునీరు, విద్యుత్‌ తదితర సౌకర్యాల లేమి ఉంది. దీంతో పాటూ వైద్య సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణంతో పాటు ఆస్పత్రి సిబ్బందిని నియమించాలని కోరుతున్నాము.

– విజయలక్ష్మీ, ఊటుకూరు, పరిగి మండలం

రామగిరి మండలంలోని పేరూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామానికి 2 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడికి వైద్యులు కూడా సరిగారారు. దీనికి తోడు ఇక్కడ మందుల దొరకవు. దీంతో రోగం వస్తే వైద్యం కోసం ఆర్‌ఎంపీ డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిందే. వారం రోజుల క్రితం వైద్యం కోసం పీహెచ్‌సీ దగ్గరకు వెళ్తే అక్కడ డాక్టర్లు ఎవ్వరూ కనిపించలేదు. దీంతో గ్రామంలో ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ దగ్గరకు వెళ్లి వైద్యం చేయించుకొన్నాను.

ముత్యాలప్ప, పేరూరు గ్రామం, రామగిరి మండలం

సాక్షి ప్రతినిధి, అనంతపురం: పది రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత మందుల పంపిణీపై రాష్ట్రవ్యాప్తంగా కూటమి సర్కారు ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 50 శాతం మంది తమకు మందులు అందడం లేదని చెప్పారు. చాలాచోట్ల యాంటీబయాటిక్స్‌ లేవు. పాముకాటు మందు లేదు. గర్భిణులకు కాన్పు సమయంలో ఇచ్చే ఇంజెక్షన్లు లేవు. అంతెందుకూ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం ఆస్పత్రిలోనే మందులు లేవు. పీహెచ్‌సీ నుంచి బోధనాసుపత్రి వరకూ మందుల కొరత రోగులను వేధిస్తోంది.

దారుణ పరిస్థితులు..

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రక్తపరీక్షలు సరిగా జరగడం లేదు. ఎమర్జెన్సీ మందులు లేవని సిబ్బంది వాపోతున్నారు. చిన్నారులకు ఇచ్చే టీకాలు కూడా సరిగా సరఫరా కావడం లేదని చెబుతున్నారు.

‘ఆరోగ్య శ్రీ’ నిర్వీర్యం..

2019–24 మధ్య కాలంలో అప్పటి సీఎం జగన్‌ చొరవతో ఆరోగ్యశ్రీ పథకం కొత్త జవసత్వాలు నింపుకుంది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా 3,250 జబ్బులకు ఈ పథకం ద్వారా చికిత్సలు అందించేవారు. అయితే, చంద్రబాబు అధ్యక్షతన కూటమి సర్కారు ఏర్పటినప్పటి నుంచి పథకం ప్రకారం ‘ఆరోగ్య శ్రీ’ని నిర్వీర్యం చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు రెండు మాసాలకోసారి సమ్మెకు దిగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం త్వరలో ‘ఆరోగ్య శ్రీ’ని ప్రైవేటు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి అప్పజెప్పబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో పథకం పరిస్థితి ఎలా ఉంటుందోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

గాల్లో దీపంలా 108, 104 ..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షలాది మందిని ఆపత్కాలంలో ఆదుకున్న 108 అంబులెన్సులు నేడు షెడ్డుకు చేరాయి. అంబులెన్సుల నిర్వహణా సంస్థను మార్చారు. పాత వాహనాలన్నీ రాప్తాడు వద్ద షెడ్డులో పడ్డాయి. కాల్‌ వెళ్లిన 30 నిమిషాల్లో ఘటనా స్థలికి వెళ్లాల్సిన అంబులెన్సు నేడు గంటకు కూడా రావడం లేదు. ఇక 104 అంబులెన్సులకు కూటమి సర్కారు రాగానే కాలం చెల్లింది. గతంలో నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి దీర్ఘకాలిక వ్యాధుల బాధితులు, గర్భిణులకు మందులివ్వడంతో పాటు వైద్య పరీక్షలు చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. 104 వాహనాలు పల్లెలకు వెళ్లక ఏడాది అవుతోంది.

పెనుకొండలో మెడికల్‌ కాలేజీకి గ్రహణం...

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో వైఎస్‌ జగన్‌ హయాంలో రూ.375 కోట్లతో మెడికల్‌ కాలేజీకి పునాది వేశారు. కూటమి సర్కారు వచ్చాక దీన్ని ముందుకు కదలనివ్వలేదు. ఉమ్మడి జిల్లా అంతటికీ కలిపి ఇప్పటికీ ‘అనంత’లో ఒక్కటే మెడికల్‌ కళాశాల ఉంది. కొత్త కాలేజీ వస్తే శ్రీ సత్యసాయి జిల్లాకు వరం అయ్యేది. కానీ ‘కూటమి’ దీన్ని కాలరాసింది.

శాశ్వత భవనాన్ని నిర్మించాలి 

ఆర్‌ఎంపీ దగ్గరకు వెళ్లాలి..

కూటమి.. కనికరం లేమి

చంద్రబాబు ప్రభుత్వంలో ప్రాథమిక ఆరోగ్య రంగం కుదేలు

104, 108 వాహనాల

సేవలకు తీవ్ర విఘాతం

మందుల కొరతతో అల్లాడుతున్న సామాన్య రోగులు

ఏడాది పాలనలో

ఆరోగ్య రంగం తిరోగమనం

పడకలు లేకపోతే ఎలా?

పరిగి మండల వ్యాప్తంగా పరిగి పీహెచ్‌సీలో మాత్రమే గతంలో వైద్య సేవలను అందించేవారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో 25 వేల మందికి పీహెచ్‌సీని ఏర్పాటు చేయాలన్న క్రమంలో ఊటుకూరుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరైంది. అధికారులు పీహెచ్‌సీ నిర్మాణానికి స్థలం కేటాయించారు. అయితే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేటికీ పీహెచ్‌సీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లో సేవలు అందిస్తున్నారు. ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు ఉన్నారు. అయితే ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్టుతో పాటు స్టాఫ్‌ నర్సులను నియమించలేదు. పీహెచ్‌సీలో ప్రస్తుతం మరుగుదొడ్డి సదుపాయం లేదు. తాగునీరు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు.

ఈ నెల 16న మా తల్లి ఆరోగ్యం విషమించడంతో అనంతపురం సర్వజ నాస్పత్రికి తీసుకువచ్చాం. అక్యూట్‌ మెడికల్‌ కేర్‌లో మంచం లేదని రెండు రోజుల పాటు ఇక్కడే ఉంచారు. ప్రాణాపాయ కేసులకు ఎప్పటికప్పుడు వార్డుకు షిఫ్ట్‌ చేసి సేవలందిస్తే బాగుంటుంది. రోజుల పాటు ఎమర్జెన్సీ వార్డులోనే ఉంచితే ఎలా.. చాలి ఇబ్బందిగా ఉంది. – తిక్కయ్య,

చిగిచెర్ల గ్రామం, ధర్మవరం మండలం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రాథమిక వైద్యం పడకేసింది. కూట1
1/2

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రాథమిక వైద్యం పడకేసింది. కూట

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రాథమిక వైద్యం పడకేసింది. కూట2
2/2

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రాథమిక వైద్యం పడకేసింది. కూట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement