
ఈ పనులకు మోక్షమెన్నడో!
రామగిరి: దశాబ్దాలుగా నీటిబొట్టులేక బోసిపోయిన పేరూరు డ్యాం (అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్).. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పూర్తి జలకళను సంతరించుకుంది. ఐదేళ్ల పాటు ఆయకట్టు మురిసిపోయింది. చుట్టుపక్కల భూగర్భ జలాలు వృద్ధి చెందడంతో వ్యవసాయ బోరు బావుల కింద వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పేరూరు డ్యాం పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. నీటి కేటాయింపులు లేక డ్యాం బోసిపోతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డ్యామ్ గేట్ల మరమ్మతులకు రూ.1.21 కోట్లను మంజూరు చేసిన కూటమి సర్కార్... పనులు పూర్తి చేయించడంలో అంతులేని ఉదాసీనత కనబరుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేరూరు డ్యాంను సందర్శించి గేట్ల మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నాలుగు నెలలు గడిచినా పనుల్లో ఏ మాత్రమూ ప్రగతి లేదు. వేసవి ముగిసింది. వర్షాలు మొదలయ్యాయి. భారీ వర్షాలు కురిస్తే పేరూరు డ్యాం పూర్తిగా నిండే అవకాశముంది. ఇలాంటి తరుణంలో డ్యామ్కు గేట్లు లేకపోవడంతో ఆ నీరంతా వృథా అవుతుందని అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ పనులకు మోక్షమెన్నడో!

ఈ పనులకు మోక్షమెన్నడో!