
రోజూ రూ. 2 వేలు నష్టం
నేను నిర్వహిస్తున్న వాటర్ ప్యాకెట్ తయారీ పరిశ్రమలో 50 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రోజూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా రూ.2 వేలకు పైగా నష్టం వస్తోంది. సమస్య పరిష్కారానికి విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా పనిలోకి వచ్చే కార్మికుల సంఖ్యను తగ్గించుకోవాల్సి వస్తోంది. ఇది పరోక్షంగా కార్మిక కుటుంబాల జీవనంపై ప్రభావం చూపుతోంది.
– నాగార్జునరెడ్డి, నీటి కవర్ల తయారీ కంపెనీ యజమాని