రాత్రంతా సాగిన బదిలీల కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

రాత్రంతా సాగిన బదిలీల కౌన్సెలింగ్‌

May 28 2025 5:51 PM | Updated on May 28 2025 5:51 PM

రాత్రంతా సాగిన బదిలీల కౌన్సెలింగ్‌

రాత్రంతా సాగిన బదిలీల కౌన్సెలింగ్‌

ఆన్‌లైన్‌ అంటూనే భౌతికంగా సాగిన కౌన్సెలింగ్‌

అనంతపురం అగ్రికల్చర్‌: వ్యవసాయశాఖ కార్యాలయంలో సోమవారం ఉదయం మొదలైన జోనల్‌ స్థాయి ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్‌ ప్రక్రియ మంగళవారం తెల్లవారుజాము సరిగ్గా 6 గంటలకు ముగిసింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జోనల్‌ స్థాయి కావడంతో ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ముగ్గురు సూపరెండెండెంట్లు, 31 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, 19 మంది ఏడీఏలు, 118 మంది ఏఓలతో పాటు రిక్వెస్ట్‌ కింద ఐదుగురు సూపరెండెండెంట్లు. 32 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, 26 మంది ఏడీఏలు, 122 మంది ఏఓలు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. వీరితో పాటు వివిధ విభాగాల అసోసియేషన్లకు చెందిన నాయకులు తరలిరావడంతో జాతరను తలపించింది. ఇందులోనూ ఎక్కువగా మహిళా ఉద్యోగులు తరలివచ్చారు. 255 మందికి పైగా కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నట్లు తెలిసినా కౌన్సెలింగ్‌ ప్రక్రియ జాప్యం చేయడం, సమయ పాలన పాటించకపోవడం, రాత్రంతా వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళా ఉద్యోగులు జాగరణతో పడిగాపులు కాసేలా చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆన్‌లైన్‌ పక్రియ అంటూనే భౌతికంగా చేపట్టారు. ప్రతి విషయంలో ఒకరిద్దరు జేడీఏలు జోక్యం చేసుకోవడంతో ఆలస్యమైనట్లు చెబుతున్నారు. ప్రధానంగా ఏఓ స్థాయి అధికారులు రాత్రంతా నిద్రలేకుండా గడిపారు. అలాగే రిక్వెస్ట్‌ కింద, అసోసియేషన్ల వెసులుబాటు, కొందరు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో సదరు ప్రజాప్రతినిధులు అధికారులపై సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement