పదోన్నతుల ఖాళీలు తగ్గించొద్దు | - | Sakshi
Sakshi News home page

పదోన్నతుల ఖాళీలు తగ్గించొద్దు

May 27 2025 12:43 AM | Updated on May 27 2025 12:43 AM

పదోన్నతుల ఖాళీలు తగ్గించొద్దు

పదోన్నతుల ఖాళీలు తగ్గించొద్దు

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ ఇంగ్లిష్‌ ఖాళీలు తగ్గించరాదని పలువురు ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం అనంతపురంలోని శారదా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలలో నిరసన వ్యక్తం చేసి, డీఈఓ ప్రసాద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. 2023లో తాత్కాలిక పదోన్నతులకు సంబంధించి ఎస్‌ఏ ఇంగ్లిష్‌లో 230 మందికి అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ప్రస్తుతం చేపట్టిన పదోన్నతులలో అంతకు తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సూర్యుడు, నాగభూషణ, కేశవరెడ్డి, జయరాం నాయక్‌, సిరాజుద్దీన్‌, శ్రీనివాసులు నాయక్‌, శ్రీదేవి, విజయశ్రీ, సురేష్‌, కృష్ణారెడ్డి, పీరూనాయక్‌, వన్నారెడ్డి, సూర్యనారాయణ, క్షీరలింగేశ్వర్‌, వెంకటేష్‌, రసూల్‌, ఓబిరెడ్డి, నరసింహులు, విశ్వనాథరెడ్డి, రాజశేఖర్‌, శివప్రసాద్‌, మధు, రమేష్‌ పాల్గొన్నారు.

డీఈఓను కోరిన ఉపాధ్యాయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement