
పాఠ్యపుస్తకాల దోపిడీ అరికట్టాలి
ధర్మవరం: ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల దోపిడీని అరికట్టాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎమ్మార్సీలో సోమవారం ఎంఈఓ రాజేశ్వరికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర, వైఎస్సార్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, ఏఐఎస్బీ జిల్లా కార్యదర్శి పోతలయ్య, వైఎస్సార్ఎస్యూ రాష్ట్ర కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి, గిరీష్ మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు ప్రారంభం కాకమునుపే అడ్మిషన్లు చేస్తున్నారన్నారు. ఫీజు వివరాలు బహిర్గతం చేయాలని కోరారు. భవిష్యత్తులో పాఠశాలల్లో పుస్తకాలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.