
వ్యవసాయ శాఖలో ‘బదిలీల జాతర’
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ శాఖలో సోమవారం బదిలీల జాతర జరిగింది. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో నిర్వహించిన జోనల్స్థాయి కౌన్సెలింగ్కు రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు రిక్వెస్ట్, సిఫారసుల కింద కూడా కొందరు ఉద్యోగులు హాజరయ్యారు. ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో అర్హత కలిగిన 31 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు సూపరింటెండెంట్లు, 19 మంది ఏడీఏలు, 118 మంది ఏఓలతో పాటు 120 మందికి పైగా రిక్వెస్ట్ కింద బదిలీ కౌన్సెలింగ్లో పాల్గొన్నారు. వ్యవసాయశాఖ కమిషనరేట్కు చెందిన అడిషినల్ డైరెక్టర్ శ్రీధర్ సమక్షంలో అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, నంద్యాల, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల జేడీఏలు ఉమామహేశ్వరమ్మ, సుబ్బారావు, నాగేశ్వరరావు, చంద్రానాయక్, మురళీక్రిష్ణ, వరలక్ష్మి, ప్రసాదరావు, జే.మురళిక్రిష్ణతో పాటు ఆయా జిల్లాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, సూపరింటెండెంట్లు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. కాగా, కౌన్సెలింగ్ జరుగుతున్న తీరుపై కొందరు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు కొందరివి పరిగణలోకి తీసుకుంటున్నా... మరికొందరివి తీసుకోవడం లేదన్నారు. అలాగే తమ విన్నపాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని కొందరు అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
పశుశాఖలో..
స్థానిక పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయంలో సోమవారం ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ముగ్గురు వెటర్నరీ అసిస్టెంట్స్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు డ్రైవర్లు, 23 మంది ఆఫీస్ సబార్డినేట్స్కు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో రెండు జిల్లాల జేడీలు డాక్టర్ జీపీ వెంకటస్వామి, డాక్టర్ జి.శుభదాస్, ఆఫీస్ మేనేజర్, సూపరెండెండెంట్లు పాల్గొన్నారు.

వ్యవసాయ శాఖలో ‘బదిలీల జాతర’