జిల్లా పరిధిలో సోమవారం ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. గాలివేగం పెరిగింది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది. | - | Sakshi
Sakshi News home page

జిల్లా పరిధిలో సోమవారం ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. గాలివేగం పెరిగింది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది.

May 27 2025 12:42 AM | Updated on May 27 2025 12:42 AM

జిల్లా పరిధిలో సోమవారం ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. గాలివే

జిల్లా పరిధిలో సోమవారం ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. గాలివే

జవాన్‌ భూమి కబ్జా

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో

కలెక్టర్‌కు ఫిర్యాదు

ప్రశాంతి నిలయం: దేశ భద్రత కోసం సరిహద్దులో పహారా కాస్తున్న జవాన్‌ భూమిని కొందరు కబ్జా చేశారు. మూడేళ్లవుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గోరంట్ల మండలం పాలసముద్రం పంచాయతీ రాగిమేకలపల్లికి చెందిన చౌడేష్‌ భారత సైన్యంలో పనిచేస్తున్నారు. ఈయనకు రాగిమేకల పల్లి రెవెన్యూ గ్రామ ఎల్‌పీఎం నంబర్‌ 72లో 4.92 ఎకరాల పొలం ఉంది. మూడేళ్ల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన కొందరు ఈ భూమిని కబ్జా చేశారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అంతేకాదు ప్రశ్నిస్తే కబ్జాదారులు జవాన్‌ తల్లి, కుటుంబ సభ్యులపై దాడులు చేస్తున్నారు. మూడేళ్లు అవుతున్నా సమస్య అలానే ఉండిపోవడంతో న్యాయం చేయాలని జవాన్‌ చౌడేష్‌ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ అందజేశారు. దేశం కోసం పాటుపడుతున్న తన ఆస్తులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. విచారణ చేపట్టి.. న్యాయం చేస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

సజావుగా పదో తరగతి

సప్లిమెంటరీ పరీక్షలు

పుట్టపర్తి: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా సాగుతున్నాయని డీఈఓ కృష్ణప్ప తెలిపారు. జిల్లాలో 34 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం సాంఘిక శాస్త్రం పరీక్షకు 2,911 మంది విద్యార్థులకు గాను 2,466 మంది హాజరయ్యారని తెలిపారు. 445 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షల చీఫ్‌ అశ్వర్థరెడ్డి ఎనుములపల్లి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ నెల 28వ తేదీతో పరీక్షలు ముగియనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement