తాగునీటి పథకం కార్మికుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

తాగునీటి పథకం కార్మికుడి దుర్మరణం

May 26 2025 1:39 AM | Updated on May 26 2025 1:39 AM

తాగునీటి పథకం కార్మికుడి దుర్మరణం

తాగునీటి పథకం కార్మికుడి దుర్మరణం

గుంతకల్లు/వజ్రకరూరు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాలు.. గుంతకల్లులోని ఆలూరు రోడ్డులో నివాసముంటున్న మంగే సూరప్ప (47) వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని శ్రీసత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ ద్విచక్ర వాహనంపై కొనకొండ్లకు వెళ్లి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో విధుల్లో పాల్గొనేందుకు శనివారం రాత్రి 10 గంటలకు ద్విచక్ర వాహనంపై కొనకొండ్లకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో రోడ్డుకు అడ్డుగా వచ్చిన గేదెలు ద్విచక్ర వాహనాన్ని తగలడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై వజ్రకరూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య రోజా, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఐటీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి సాకే నాగరాజు, తాగునీటి పథకం కార్మికుల సంఘం నాయకుడు పి.చిన్న బాబయ్య గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉంచిన సూరప్ప మృతదేహాన్ని పరిశీలించి, నివాళులర్పించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సూరప్ప మృతిపై ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంటనే రూ.20 లక్షల పరిహారం చెల్లించడంతోపాటు ఆయన కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వారి వెంట నాయకులు తిమ్మప్ప, సురేంద్ర, కె.రామాంజినేయులు, వెంకటాద్రి, సంతోష్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement