
ఆక్రమణల ‘తమ్ముడు’..అడిగేవారే లేరు
సాక్షి టాస్క్ ఫోర్స్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక టీడీపీ నేతల దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ఆక్రమణలకు అంతేలేకుండా పోతోంది. ముఖ్యంగా బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో ఆ పార్టీ నేతలు ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. ఇక మోతుకపల్లికి చెందిన టీడీపీ నేత చంద్రమోహన్ ఏకంగా ఆస్తులపై కన్నేసి మరీ ఆక్రమణల పర్వం కొనసాగిస్తున్నాడు.
డ్రైన్ను పూడ్చేసి... చదును చేసి
హిందూపురం – పరిగి ప్రధాన రహదారి కొడిగేపల్లి పంచాయతీ పరిధిలో చంద్రమోహన్కు పెట్రోల్ బంక్ ఉంది. ఈ బంకు వద్ద డ్రైన్ నిర్మించేందుకు గతంలో అధికారులు ప్రయత్నించగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడం, ఆపై కూటమి అధికారంలోకి రావడంతో చంద్రమోహన్ రెచ్చిపోయాడు. తాజాగా ఏకంగా పాత డ్రైన్ను పూడ్చి వేసి భూమిని చదును చేయించి రోడ్డునే ఆక్రమించాడు. ఆయనకు ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల అండ ఉండటంతో అటు అధికారులు, ఇటు ప్రజలు ఆయన దుర్మార్గంపై కనీసం నోరు మెదపలేకపోతున్నారు.
పురంలో రెచ్చిపోతున్న
టీడీపీ నేత చంద్రమోహన్
డ్రైన్ వెయ్యనీయకుండా అడ్డుకుని
రోడ్డు ఆక్రమణ

ఆక్రమణల ‘తమ్ముడు’..అడిగేవారే లేరు