
నిర్లక్ష్యంగా దిద్దారు!
కోవూరు మండలం వేగూరు గ్రామానికి చెందిన రామిశెట్టి సాయికుందన స్థానిక వశిష్ట స్కూల్లో పదో తరగతి చదివింది. ఇంగ్లిష్ సబ్జెక్ట్లో 34 మార్కులొచ్చాయి. బాగా చదివే సాయికుందనకు ఫస్ట్ లాంగ్వేజ్లో 94, సెకండ్ లాంగ్వేజ్లో 79, మ్యాథ్స్లో 96, సైన్స్లో 92, సోషల్లో 94 మార్కులొచ్చాయి. ఈ నేపథ్యంలో రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసింది. ఇంగ్లిష్లో 93 మార్కులొచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ రీతిలో పదో తరగతిలో ఫెయిలైన పలువురు విద్యార్థులకు రీవాల్యుయేషన్, రీకౌంటింగ్లో మార్కులు పెరిగాయి.

నిర్లక్ష్యంగా దిద్దారు!