
టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తా
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: వేములవాడను టెంపుల్సిటీగా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని 13, 14, 15, 16వ వార్డుల్లో సైడ్డ్రైన్, సీసీరోడ్లు, సీసీ కల్వర్టుల నిర్మాణనికి గురువారం శంకుస్థాపన చేశారు. ప్రజాప్రభుత్వంలో అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. సంతోష్నగర్లో మహిళల కోరిక మేరకు బతుకమ్మ తెప్ప నిర్మిస్తామని తెలిపారు. గతంలో తాగునీటి సరఫరా కోసం ఇదే కాలనీలో రూ.15కోట్లతో తాగునీటి ట్యాంక్ నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోతున్న వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆలోచన చేస్తుందని వెల్లడించారు. త్వరలోనే రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.76కోట్లతో టెండర్లు పిలువనున్నట్లు చెప్పారు. రాబోవు రోజుల్లో ఏ ఎన్నిక వచ్చిన మీ మద్దతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు.