సిరిసిల్ల అర్బన్: కార్మికుల కనీస వేతన సవరణ జీవోను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీఎంఎస్ (భారతీయ మజ్దూర్ సంఘ్) రాష్ట్ర అధ్యక్షుడు కలల్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ వద్ద కార్మికులతో నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కోటి యాభై లక్షల మంది కార్మికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వేతన సవరణ జీవోలను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఇక్కడ బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రవీందర్రెడ్డి, కార్యదర్శి కొండల్రెడ్డి, జిల్లా కన్వీనర్ పొన్న మేఘన, కోకన్వీనర్ రజిత తదితరులు పాల్గొన్నారు.
షెడ్ కూల్చివేత
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సిరిసిల్ల సింగిల్విండో చైర్మన్ బండి దేవదాస్ వ్యవసాయక్షేత్రంలోని రేకుల షెడ్డును గురువారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మండెపలిలోని సర్వేనంబర్ 374లో 3.25 ఎకరాలను ప్రభుత్వం మూడు నెలల క్రితమే స్వాధీ నం చేసుకుందని తహసీల్దార్ జయంత్కుమార్ తెలిపారు. అక్రమంగా నిర్మించిన రేకులషెడ్డును కూల్చివేశామన్నారు. సింగిల్విండో చైర్మన్ బండి దేవదాస్ మాట్లాడుతూ అధికారులు నోటీసులు ఇవ్వకుండానే రేకులషెడ్డును కూల్చివేశారని ఆరో పించారు. హైకోర్టు నుంచి స్టే ఉన్నా కూల్చివే యడంపై కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.