
కాంగ్రెస్ నాయకుడిపై దాడి
● కేసు నమోదు
జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ మాజీ అధ్యక్షుడిపై అదే పార్టీకి చెందిన ఓ నాయకుడు దాడిచేశాడని టౌన్ సీఐ ఎస్.రామకృష్ణ గురువారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కొత్తపల్లిలోని కసుబోజుల వెంకన్న ఇంటికి బుధవారం రాత్రి వెళ్లిన దేశిని కోటేశ్వర్(కోటి) రాబోయే ఎన్నికల్లో తనకు సపోర్టు చేయాలని బెదిరిస్తూ కర్రతో తలపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన అతని భార్యపై సైతం దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
కరీంనగర్– తిరుపతికి ప్రత్యేక రైలు
కరీంనగర్రూరల్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జూలై నెలలో కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు నడిపించేందుకు దక్షిణమధ్య రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. జూలై 6నుంచి 27వరకు రైలు నంబరు 02761 తిరుపతి నుంచి కరీంనగర్కు 4 ట్రిప్పులు, 7 జూలై నుంచి 28 వరకు రైలు నంబరు 02762 కరీంనగర్ నుంచి తిరుపతికి 4 ట్రిప్పులు నడిపించనున్నారు. ప్రతీ ఆదివారం తిరుపతి నుంచి ప్రత్యేక రైలు బయల్దేరి సోమవారం కరీంనగర్కు చేరుకుంటుంది. కరీంనగర్ నుంచి తిరుపతికి తిరిగి బయల్దేరుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నెలరోజుల పాటు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని కరీంనగర్స్టేషన్ మేనేజరు రవీందర్ తెలిపారు. రెగ్యులర్గా కరీంనగర్ నుంచి ప్రతి గు రు, ఆదివారాల్లో తిరుపతికి నడిచే రైలుకు అదనంగా ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు వివరించారు.