
పెద్దబడి నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ వరకు..
ఎల్లారెడ్డిపేట పెద్దబడిలో అక్షరాలు దిద్దిన నలిమెల భాస్కర్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకునే వరకు ఎదిగారు. మండల కేంద్రంలోని హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. కామారెడ్డిలో ఇంటర్, డిగ్రీ చదివారు. మొదట ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన భాస్కర్ తర్వాత లెక్చరర్గా ఎంపికయ్యారు. కరీంనగర్ ఎస్సారార్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. 14 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన భాస్కర్ ఎన్నో పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. మళయాళం అనువాద కవిత స్మారక శిలలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులమీదుగా కాళోజీ పురస్కారం స్వీకరించారు. పెద్దబడిలో ఆనాటి పరిస్థితులు అధిగమించి చదువుకున్న తాము ఈ స్థాయికి ఎదగడానికి తమ గురువుల బోధనలేనని నలిమెల భాస్కర్ గుర్తు చేసుకున్నారు. ఈ పాఠశాలలో విద్యార్థులు చేరి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.