నాటి విద్యార్థి.. నేటి ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

నాటి విద్యార్థి.. నేటి ఎస్పీ

Jun 13 2025 4:47 AM | Updated on Jun 13 2025 4:47 AM

నాటి విద్యార్థి.. నేటి ఎస్పీ

నాటి విద్యార్థి.. నేటి ఎస్పీ

ప్రస్తుత వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన భూక్య రాంరెడ్డి ఎల్లారెడ్డిపేటలోని పెద్దబడిలో చదువుకొని ఎస్పీ స్థాయికి ఎదిగారు. రాంరెడ్డి మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్‌లో ఉంటూ స్థానిక పెద్దబడి(హైస్కూల్‌)లో చదువుకున్నారు. 1981–82లో పదో తరగతి చదివిన రాంరెడ్డి ఇంటర్‌ నాగార్జునసాగర్‌లోని ఏపీఆర్‌జేసీలో, డిగ్రీ కరీంనగర్‌లోని ఎస్సారార్‌ కాలేజీలో చదివారు. 1989లో ఎస్సైగా ఎంపికయ్యారు. సీఐగా ఏడూర్లబయ్యారం, ఆదిలాబాద్‌, డీఎస్పీగా డీటీసీ వరంగల్‌, వైరా, పీటీసీ కరీంనగర్‌లో పనిచేశారు. అడిషనల్‌ ఎస్పీగా పదోన్నతి పొంది సీఐడీ వరంగల్‌లో పనిచేశారు. 2024, ఆగస్టు 14న ఎస్పీగా పదోన్నతి పొంది హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే లంబాడాలలో ఎస్పీగా ఎదిగిన తొలి వ్యక్తి రాంరెడ్డి కావడం గమనార్హం. ఎల్లారెడ్డిపేట పెద్దబడిలో చదివిన రాంరెడ్డి ఎస్పీ స్థాయికి ఎదిగి నేటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement