
ఈ ప్రాంతబిడ్డ కలెక్టర్..
ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్కు చెందిన కేవీ రమణాచారి మండల కేంద్రంలోని పెద్దబడిలో చదువుకొని దేశంలోనే అత్యున్నత ఉద్యోగం కలెక్టర్గా ఎంపికయ్యారు. కలెక్టర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖలతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఈవోగా తనదైన ముద్ర వేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ సలహాదారుగా మాజీ సీఎం కేసీఆర్ వద్ద తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఎల్లారెడ్డిపేట పెద్దబడిలో చదువుకొని కలెక్టర్గా ఎదిగిన రమమణాచారి ఈ ప్రాంతంలోని విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఎంతో మంది ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదిగారు.