
ఫస్ట్ ఇంజినీర్.. శాస్త్రవేత్త
ఎల్లారెడ్డిపేటకు చెందిన వేముల మనోహర్ పెద్దబడిలోనే విద్యాభ్యాసం పూర్తి చేసి.. దేశం గర్వించే శాస్త్రవేత్తగా ఎదిగారు. 1981–82లో పదోతరగతి పూర్తి చేశారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీర్ పట్టా అందుకున్నారు. ఎల్లారెడ్డిపేట నుంచి ఇంజినీరింగ్ చదివిన వారిలో మొదటి వారు మనోహర్ మాత్రమే. మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మిసైల్ కాంప్లెక్స్లో డీఆర్డీఎల్(డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబరేటరీస్) సైంటిస్ట్గా విధులు నిర్వర్తిస్తున్నారు.