
దేశం గర్వించే స్థాయికి ఎదిగారు
ఎల్లారెడ్డిపేట హైస్కూల్లో చదువుకున్న వారు ఎందరో దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. వారంతా సమాజ శ్రేయస్సు కోసం తమ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఐఏఎస్లుగా, సైంటిస్ట్లుగా, ఇంజినీర్లుగా, పోలీసులుగా సేవలందిస్తున్నారు. ఈ బడిలో చదువుకున్న పూర్వ విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుత విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలి. పెద్దబడిలో ఉన్న సౌకర్యాలను వినియోగించుకోవాలి. కార్పొరేట్ స్కూళ్లకు మించి ఇక్కడ వసతులు ఉన్నాయి. విద్యాబోధన కూడా అంతకుమించి ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పెద్దబడిలో చేర్చండి. వారిని మేము ఉన్నతంగా తీర్చిదిద్దుతాం.
– మనోహరాచారి, హెచ్ఎం, ఎల్లారెడ్డిపేట పెద్దబడి