14న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

14న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌

Jun 13 2025 4:47 AM | Updated on Jun 13 2025 4:47 AM

14న జ

14న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌

సిరిసిల్లకల్చరల్‌: ఈనెల 14న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు. రాజీతో పరి ష్కరించుకోదగిన కేసుల విషయంలో కక్షిదా రులు సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవా లని సూచించారు. వీలైనన్నీ ఎక్కువ కేసులు అదాలత్‌లో పరిష్కారమయ్యేలా సహకరించా లని న్యాయవాదులను కోరారు.

ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ‘తుమ్మల’

‘అడ్లూరి’కి నల్గొండ జిల్లా బాధ్యతలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్థానంలో తుమ్మల నాగేశ్వరరావును నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్ర భాకర్‌ల ఇన్‌చార్జీ బాధ్యతల్లో ఎలాంటి మార్పు జరగలేదు. రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జీ మంత్రిగా శ్రీధర్‌బాబు, హైదరాబాద్‌ జిల్లా మంత్రిగా పొన్నం ప్రభాకర్‌లను కొనసాగించారు. ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను నల్గొండ ఉమ్మడి జిల్లా మంత్రిగా నియమించారు.

కేంద్ర పథకాలతోనే రాష్ట్రంలో అభివృద్ధి

సిరిసిల్లఅర్బన్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం 11 ఏళ్లపాటు బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తుందన్నారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి నిధులు కేంటాయిండంతోపాటు ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క గిరిజ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మట్ట వెంకటేశ్వరెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి దేవేందర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

మూతపడిన స్కూల్‌ పునఃప్రారంభం

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండలంలో నాలుగేళ్ల క్రితం మూతపడ్డ ఎర్రనర్సుపల్లి ప్రాథమిక పాఠశాల గురువారం పునర్‌ప్రారంభమైంది. ఐదుగురు విద్యార్థులు పాఠశాలకు వచ్చినట్లు ఉపాధ్యాయుడు అశోక్‌కుమార్‌ తెలిపారు. 2021లో మూతపడిన స్కూల్‌ తిరిగి ప్రారంభించడంపై పల్లె ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఎర్రనర్సుపల్లి స్కూల్‌ మూతపడ్డ విషయాన్ని గతంలో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఎంఈవో శ్రీనివాస్‌గౌడ్‌ బుధవారం స్కూల్‌ను పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడడంతో పిల్లలను చేర్పించారు.

సినారెకు నివాళి

సిరిసిల్లకల్చరల్‌/వేములవాడ: జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా జిల్లా కవులు నివాళి అ ర్పించారు. జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ భవనంలో ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్‌ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు.

కవి సమ్మేళనం

వేములవాడలో కవితాభారతి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. సినారె సాహిత్యం, సినీ గేయరచనలపై కవితలు వినిపించారు. కవులు జి.నర్సన్‌, రిటైర్డ్‌ లెక్చరర్లు ఆడెపు నారాయణ, వీరగోని ఆంజ నేయులు, గూడూరి బాలరాజు, అంకారపు రవి, బూర దేవానందం, అద్దెంకి రాజు ఉన్నారు.

14న జాతీయ   మెగా లోక్‌ అదాలత్‌
1
1/4

14న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌

14న జాతీయ   మెగా లోక్‌ అదాలత్‌
2
2/4

14న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌

14న జాతీయ   మెగా లోక్‌ అదాలత్‌
3
3/4

14న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌

14న జాతీయ   మెగా లోక్‌ అదాలత్‌
4
4/4

14న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement