విద్యతో ఆర్థిక అసమానతలు దూరం | - | Sakshi
Sakshi News home page

విద్యతో ఆర్థిక అసమానతలు దూరం

Jun 13 2025 4:47 AM | Updated on Jun 13 2025 4:47 AM

విద్యతో ఆర్థిక అసమానతలు దూరం

విద్యతో ఆర్థిక అసమానతలు దూరం

సిరిసిల్ల: విద్యతోనే సమాజంలో ఆర్థిక అసమానతలు దూరమవుతాయని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ ‘బడిబాట’లో భాగంగా సిరిసిల్ల పట్టణం గీతానగర్‌ జెడ్పీ స్కూల్‌లో గురువారం విద్యార్థులకు యూనిఫామ్స్‌, పాఠ్యపుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలన్నారు. డాక్టర్‌, ఇంజినీర్‌, లాయర్‌ ఇతర ఉన్నత ఉద్యోగాలు, తాము ఎంచుకున్న రంగమే లక్ష్యంగా చదవాలని సూచించారు. విద్యార్థులు పుస్తకాలలోని ప్రతీ అంశంపై లోతుగా అధ్యయనం చేయాలన్నారు. పాఠ్యాంశాలలోని అనుమానాలను ఉపాధ్యాయులతో చర్చించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. పాఠశాలలో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. ఈ పాఠశాలలోని విద్యార్థులకు అన్‌ అకాడమీ ద్వారా ఐఐటీ, నీట్‌ పోటీ పరీక్షలకు శిక్షణ అందించే ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ వెల్ముల స్వరూపారెడ్డి, జిల్లా విద్యాధికారి వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

యోగా దినోత్సవ పోస్టర్‌ ఆవిష్కరణ

ఈనెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా గురువారం ఆవిష్కరించారు. ఈనెల 19న కలెక్టరేట్‌లో అధి కారులతో యోగా కార్యక్రమం నిర్వహణకు కలెక్టర్‌ అనుమతించారు. జిల్లా ఆయుష్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ శశిప్రభ, సహాయ నోడల్‌ అధికారులు డాక్టర్‌ సౌమిని, డాక్టర్‌ శ్వేత, డీపీఎం తిరుపతి, యోగా శిక్షకులు బొల్లాజీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

యోగా దినోత్సవ పోస్టర్‌ ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement