
సర్కార్ కళాశాలల్లో నాణ్యమైన విద్య
● డీఐఈవో శ్రీనివాస్
సిరిసిల్లకల్చరల్/సిరిసిల్లటౌన్: ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై.శ్రీనివాస్ పేర్కొన్నారు. సెస్ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వనజాకుమారి, అధ్యాపకులు తంగళ్లపల్లిలో బుధవారం ఇంటింటా ప్రచారం చేశారు. వారు మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థల కంటే ప్రభుత్వ కళాశాల విద్యార్థులే అన్ని పోటీపరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రైవేట్ కళాశాలల్లో సీటు వచ్చినా ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా చదువవచ్చన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు.