మనసు చలించిపోతోంది ! | - | Sakshi
Sakshi News home page

మనసు చలించిపోతోంది !

Jun 12 2025 3:35 AM | Updated on Jun 12 2025 3:35 AM

మనసు చలించిపోతోంది !

మనసు చలించిపోతోంది !

భక్తుల రద్దీ
వేములవాడ: రాజన్నను బుధవారం 15వేల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారి హుండీలలో భక్తులు వేసిన కట్నాలు, కానుకలను గురువారం లెక్కించనున్నారు.
వాతావరణం
ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడ స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి.

ఇల్లంతకుంట(మానకొండూర్‌): సెలవులు రావడంతో రెండు నెలలుగా సందడి లేని స్కూళ్లు ఈరోజు జీవకళ సంతరించుకుంటున్నాయి. కానీ నేను ఏడాదిగా నా పిల్లలకు దూరంగానే ఉంటున్నాను. నన్ను పలకరించేవారు కరువయ్యారు. వేసవి సెలవులు వస్తేనే పిల్లలు లేక బోసిపోయి ఉండేదాన్ని. ఎప్పుడెప్పుడు సెలవులు ముగుస్తాయా.. అని ఎదురుచూసేదాన్ని. కానీ నా గేట్‌కు తాళం వేయడంతో ఎన్నాళ్లకు నాకు పునర్‌వైభవం వస్తుందోనని ఏడాదిగా ఎదురుచూస్తున్నాను. నేను మీకు గుర్తున్నానా.. అదే రహీంఖాన్‌పేట చిన్నబడిని. ఏడాది క్రితం పిల్లల సంఖ్య తగ్గిందని తాళం వేసి పోయిన మీరు ఇటువైపు చూడడమే లేదు. నా గతాన్ని తలచుకుంటే దుఃఖం ఆగడం లేదు. 1955లో ప్రారంభమైనప్పుడు ఎంతో దర్జాగా ఉండేదాన్ని. రంగురంగుల డ్రెస్సుల్లో పిల్లలు వస్తుంటే నా ఠీవీయే వేరు. ఈ లోకంలో నన్ను మించిన వారు లేరనే భావనతో ఉండేదాన్ని. ఊరిలోని పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల పిల్లలు నా ఒడిలోనే చదువుకొని ఉన్నతంగా ఎదిగారు. అయితే నా ఒడిలో ఓనమాలు దిద్దినవారే.. తమ పిల్లలను ప్రైవేట్‌కు పంపుతుండడం నన్ను కలచివేసింది. పొద్దుగాలనే వస్తున్న ప్రైవేట్‌ స్కూళ్ల బస్సుల్లో పిల్లలను పంపుతుంటే నా మనసు చలించిపోతోంది. నా ఒడిలో పెరిగి.. విద్యాబుద్ధులు నేర్చిన వారు.. తమ పిల్లలను ప్రైవేట్‌ బడులకు పంపిస్తుండడంతో నా హృదయం గాయపడింది.

జర ఆలోచించుండ్రి

రెండు వేల జనాభా ఉన్న ఊరిలో పది మంది పిల్లలు కూడా నా దగ్గరికి రాకుండా అయ్యారంటే తప్పెవరిదీ? ఊరిలోకి ప్రైవేటు పాఠశాలల బస్సులు రాగానే పిల్లలు ఎక్కిస్తున్నా తల్లిదండ్రులదా..? పిల్లలు రాకపోతే తల్లిదండ్రులకు మంచి మాట చెప్పి మార్చాల్సింది పోయి మూతవేసిన అధికారులదా..? ఇప్పటికై నా ఆలోచించుండ్రి. కనీసం నా ఒడిలో చదువుకుని బాగుపడ్డ పిల్లల్లో ఒక్కరు కూడా పట్టించుకునే వారు లేరా..? చిన్న ఆలోచనే నన్ను బతికేలా చేస్తుంది. ఎవరో ఒక్కరూ ముందుకొస్తేనే కదా.. మార్పు వచ్చేది. ఊరిలోని నన్ను పట్టించుకుంటే ఎలాంటి ఖర్చు లేకుండా.. కడుపునిండా భోజనం పెడుతూ.. వేసుకునేందుకు రెండు డ్రెస్సులు ఇస్తూనే.. నాణ్యమైన చదువు చెబుతాను కదా.. ఈ ఆలోచన నా పిల్లలకు(నా వద్దే చదువుకున్న విద్యార్థులు) ఎందుకు రావడం లేదు. కనీసం నా గోడు వినైనా ఈ యేడు తమ పిల్లలను నా వద్దకు పంపుతారని ఆశిస్తూ..

ఇట్లు

–––––––––––

మీకు విద్యాబుద్ధులు నేర్పిన సర్కార్‌ బడి

(జిల్లాలో మూతపడ్డ ఓ పాఠశాల ఆవేదన ఇదీ..)

నా పిల్లలే పట్టించుకోకపోతే

ఎవరికీ చెప్పుకునేది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement