
న్యాయవాదులు ఆరోగ్య స్పృహ పెంచుకోవాలి
సిరిసిల్లకల్చరల్/సిరిసిల్లటౌన్: న్యాయవాదులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ కోరారు. న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం మెడికవర్ ఆస్పత్రి నిర్వాహకులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తి వైద్యశిబిరం ప్రారంభించి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. అనంతరం 200 మంది న్యాయవాదులు శిబిరంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ బీరకాయల లోకేశ్ ఆధ్వర్యంలో గుండె సంబంధిత వైద్యపరీక్షలు చేశారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.ప్రవీణ్, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కావేటి సృజన, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గడ్డం మేఘన, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు రూ.8లక్షలు ఇవ్వాలి
సిరిసిల్లఅర్బన్: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5లక్షలు సరిపోవడం లేదని.. రూ.8లక్షలకు పెంచాలని సీపీఐ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ ఆఫీస్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ హయాంలో సగం వరకు ఇళ్లు నిర్మించుకున్న ఆగిపోయిన లబ్ధిదారులను సైతం ప్రస్తుతం అర్హులుగా గుర్తించాలని కోరారు. పోచమల్లు, సాయిలు, రాజయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఆత్మరక్షణకు కరాటే
వేములవాడ: ఆత్మరక్షణకు కరాటే దోహదపడుతుందని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని మహదేవ ఫంక్షన్హాల్లో బుధవారం నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ టెస్టుల్లో నెగ్గిన విద్యార్థులకు బెల్టులు ప్రదానం చేశారు. కరాటే మాస్టర్ మన్నాన్, కోచ్లు రాజు, రాజశేఖర్, వర్షిత్, రిషిక్తేజ, సూర్య జయచంద్ర పాల్గొన్నారు.
జిల్లాలో చిరుజల్లులు
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా బుధవారం చిరుజల్లులు కురిశాయి. బోయినపల్లిలో 6.4 మిల్లీమీటర్లు, చందుర్తిలో 0.4, రుద్రంగిలో 1.2, వేములవాడ రూరల్లో 2.0, వేములవాడలో 1.5, సిరిసిల్లలో 1.8, కోనరావుపేటలో 0.6, వీర్నపల్లిలో 1.6, ఎల్లారెడ్డిపేటలో 1.0, ముస్తాబాద్లో 0.3, తంగళ్లపల్లిలో 3.5, ఇల్లంతకుంటలో 1.0 మిల్లీమీటర్ల వర్షం పడింది. గంభీరావుపేటలో వర్షం పడలేదు.
చదువుకుంటూ.. శ్రమించే పిల్లలను ప్రోత్సహించాలి
● మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్
సిరిసిల్ల: చదువుకుంటూ.. సంపాదిస్తూ.. కుటుంబాలకు అండగా ఉండే పిల్లలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆడెపు రవీందర్ పేర్కొన్నారు. పేపర్బాయ్స్గా పనిచేసే పిల్లలకు బుధవారం రెయిన్కోట్స్ పంపిణీ చేశారు. రవీందర్ మాట్లాడుతూ వర్షాకాలంలో ఇంటింటికీ తిరుగుతూ పేపర్ వేయడం ఇబ్బందిగా ఉంటుందని రెయిన్కోట్స్ అందించేందుకు ముందుకొచ్చిన దాతలను అభినందించారు. సిరిసిల్ల పట్టణ న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోచంపల్లి రాజు, ఉపాధ్యక్షుడు తడక చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి మల్లేశంగౌడ్, సలహాదారులు బైరి దేవదాస్, యెల్లె రాజేంద్రప్రసాద్, కోశాధికారి గుడెల్లి నాగభూషణం, సహాయ కార్యదర్శి రాగుల వేణుగోపాల్, కార్యవర్గ సభ్యులు బొద్దుల బాలకృష్ణ, పిస్క సాయికుమార్, వెంగళ శ్రీకాంత్, నక్క వెంకటేశ్, చిట్యాల శ్రీహరి, గాజుల అశోక్, తడుక బాలకిషన్ పాల్గొన్నారు.

న్యాయవాదులు ఆరోగ్య స్పృహ పెంచుకోవాలి

న్యాయవాదులు ఆరోగ్య స్పృహ పెంచుకోవాలి