● కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ● మిషన్‌ భగీరథను పరిశీలించిన కేంద్ర బృందం | - | Sakshi
Sakshi News home page

● కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ● మిషన్‌ భగీరథను పరిశీలించిన కేంద్ర బృందం

Jun 12 2025 3:35 AM | Updated on Jun 12 2025 3:35 AM

● కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ● మిషన్‌ భగీరథను పరిశీలిం

● కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ● మిషన్‌ భగీరథను పరిశీలిం

సిరిసిల్ల: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా కోరారు. జిల్లాలో బుధవారం కేంద్ర ప్రభుత్వ జాయింట్‌ సెక్రెటరీ సెంథిల్‌ రాజన్‌ టెక్నికల్‌ బృందం పర్యటించింది. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి కృషి సంచాన్‌ యోజన, జల్‌జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టులపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో పీఎంకేఎస్‌వై కింద చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పురోగతి వివరాలు, మిషన్‌ భగీరథ, జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టు వివరాలను కేంద్ర అధికారులకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి ఇందిరమ్మ ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ ద్వారా జిల్లాలో 85 శాతం ఆయకట్టు సృష్టించినట్లు కలెక్టర్‌ వివరించారు. జిల్లాలో 333 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్‌ కెనాల్స్‌ నిర్మించాల్సి ఉండగా 280 కిలోమీటర్ల పనులు పూర్తి చేశామన్నారు. ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్లు 2008 నాటివి ఉండడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదన్నారు. భూసేకరణకు, డిస్ట్రిబ్యూషన్‌ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. డిసెంబర్‌ 2026 నాటికి ఈ ప్రాజెక్టు చివరి ఆయకట్టు పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–9 ద్వారా..

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–9లో మిడ్‌మానేరు రిజర్వాయర్‌ నుంచి టన్నెల్‌, లిఫ్ట్‌ ద్వారా మల్కపేట రిజర్వాయర్‌ నింపుతామని, ఇక్కడి నుంచి కాల్వల ద్వారా ఎల్లారెడిపేట, మరో 2 మండలాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. సమావేశం అనంతరం కలెక్టర్‌, కేంద్ర అధికారుల బృందంతో కలిసి అగ్రహారం మిషన్‌ భగీరథ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, నీటి పారుదల ప్రాజెక్టులను, ముస్తాబాద్‌ మండలం కొండాపూర్‌, మోర్రాయిపల్లి గ్రామాల్లోని నీటి ట్యాంకులు, గ్రిడ్‌ ద్వారా నీటిని సరఫరా చేసే విధానాన్ని పరిశీలించారు. ఈ బృందం రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనుంది. ఈఈ జానకి, డీఆర్‌డీవో శేషాద్రి, ఎంపీడీవో బీరయ్య, డీఈలు ఉన్నారు.

కోడెలను పక్కదారి పట్టిస్తే చర్యలు

వేములవాడఅర్బన్‌: కోడెలను పక్కదారి పట్టిస్తే చర్యలు తీసుకుంటామని, వ్యవసాయ పనులకు మాత్రమే ఉపయోగించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సూచించారు. తిప్పాపూర్‌లోని గోశాలలో కోడెల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు పరిశీలించి, అర్హులకు 190 జతల కోడెలను బుధవారం పంపిణీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌ బేగం, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్‌రెడ్డి, గోశాల కమిటీ సభ్యులు రాధా కిషన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement