
ఆలయ అభివృద్ధిలో సొంత ఎజెండా లేదు
● అభినవ తీర్థ సదన్కు భూమి పూజ చేసిన ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధిలో తన సొంత ఎజెండా ఏమీ లేదని, ప్రజాభీష్టం మేరకు, శృంగేరిపీఠాధిపతుల అనుమతులతో పనులు చేపట్టబోతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. పట్టణంలోని శంకరమఠం వెనుక భాగంలో అనువంశిక అర్చక ట్రస్ట్, బ్రాహ్మణ నిత్యాన్నసత్రం ఆధ్వర్యంలో అభినవ విద్యాతీర్థ సదన్ నిర్మాణం పనులకు బుధవారం భూమిపూజ చేశారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాజన్న క్షేత్రంలో బ్రాహ్మణుల కోసం వసతిగృహం ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ అభివృద్ధిపై త్వరలోనే పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం గౌరవాధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నామాల లక్ష్మీరాజం, రామతీర్థపు రాజు, గడ్డం నర్సయ్య, రేగుల మల్లికార్జున్, మధు రాధాకిషన్, నరహరిశర్మ, బుడంగారి మహేశ్, పురాణం రాము, మామిడిపల్లి వెంకటేశం, గర్శకుర్తి వెంకటేశం, చంద్రగిరి శరత్, గోపన్నగారి చందు, నమిలకొండ ఉమేశ్, మధు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.