
బీఆర్ఎస్ అవినీతికి పరాకాష్ట కాళేశ్వరం
● కరీంనగర్ పార్లమెంట్ కో–కన్వీనర్ చక్రధర్రెడ్డి
ముస్తాబాద్(సిరిసిల్ల): పదేళ్ల బీఆర్ఎస్ పాలన అవినీతికి పరాకాష్టగా కాళేశ్వరం ప్రాజెక్టు మిగిలిపోయిందని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ కో–కన్వీనర్ కనమేని చక్రధర్రెడ్డి విమర్శించారు. ముస్తాబాద్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పతనం ప్రారంభమైందన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలుచేశారని ఆరోపించారు. విచారణ కమిషన్ ఎదుట వాస్తవాలు చెప్పి, ప్రజలకు నిజాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన వారందరు జైలుకు వెళ్లక తప్పదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్రెడ్డి ధరణిని బంగాళాఖాతంలో కలిపి.. భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు కలకొండ కిషన్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్నేని అంజన్రావు, వేణు, పుట్ట చంద్రయ్య, శ్రీకాంత్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.