
పోషణతో కూడిన విద్యనందించడమే లక్ష్యం
● జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం
వేములవాడరూరల్: పోషణతో కూడిన విద్యనందించడమే లక్ష్యమని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం పేర్కొన్నారు. వేములవాడరూరల్ మండలం ఎదురుగట్లలో మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘అమ్మ మాట – అంగన్వాడీ బాట’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 ఏళ్ల పిల్లల నమోదు పెంచడం, ప్రీస్కూల్ హాజరును పెంచడం ముఖ్య ఉద్దేశమన్నారు. చదువుతోపాటు పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. సీడీపీవో సౌందర్య తదితరులు పాల్గొన్నారు.