పోషణతో కూడిన విద్యనందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పోషణతో కూడిన విద్యనందించడమే లక్ష్యం

Jun 12 2025 3:35 AM | Updated on Jun 12 2025 3:35 AM

పోషణతో కూడిన విద్యనందించడమే లక్ష్యం

పోషణతో కూడిన విద్యనందించడమే లక్ష్యం

● జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం

వేములవాడరూరల్‌: పోషణతో కూడిన విద్యనందించడమే లక్ష్యమని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం పేర్కొన్నారు. వేములవాడరూరల్‌ మండలం ఎదురుగట్లలో మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘అమ్మ మాట – అంగన్‌వాడీ బాట’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రంలో 3 నుంచి 6 ఏళ్ల పిల్లల నమోదు పెంచడం, ప్రీస్కూల్‌ హాజరును పెంచడం ముఖ్య ఉద్దేశమన్నారు. చదువుతోపాటు పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. సీడీపీవో సౌందర్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement