
భూ సమస్యలు పరిష్కరిస్తాం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): భూ సమస్యలు ఉంటే రెవెన్యూ సదస్సులలో దరఖాస్తు చేసుకోవాలని, పరిష్కరిస్తామని సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మాట్లాడారు. దీర్ఘకాలికంగా భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించే అవకాశం కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తహసీల్దార్ సుజాత, ఆర్ఐ శ్రావణ్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.