
విస్తరణపై సింగరేణి నజర్
గోదావరిఖని: సింగరేణి బొగ్గ గనుల విస్తరణపై యాజమాన్యం దృష్టి సారించింది. కొన్ని ఏరియాల్లో కొత్తగనులకు అటవీ అనుమతులు అవసరంకాగా మరికొన్ని ఏరియాల్లో అన్వేషణ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ప్రధానంగా మూడు ఏరియాల్లో కొత్తగనులు రాకపోతే భవిష్యత్ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొత్త బొగ్గు గనుల అన్వేషణ బాధ్యతలను ఆయా ఏరియాల జీఎంలకు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సింగరేణి సీఎండీ తొలిసారి అన్ని ఏరియాల జీఎంలతో మూ డురోజుల క్రితం ఈ అంశంపై సమీక్షించారు. కంపెనీ విస్తరణ, ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంలో డైరెక్టర్లు, ముఖ్య అధికారులు పోషించాల్సిన పాత్రపై దిశానిర్దేశం చేశారు.
బొగ్గు ఉత్పత్తి, రవాణాపై దృష్టి
అన్ని ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింరేణి సీఎండీ జీఎంలకు దిశానిర్దేశం చేశారు. బొగ్గు రవాణాలో తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు చేపట్టాలని పేర్కొన్నారు. బొగ్గు నాణ్యత, రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని, పనుల్లో సమర్థత ప్రదర్శించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
మూడు ఏరియాల్లో కొత్తగనులు అవసరం
సింగరేణిలో మొత్తం 11 ఏరియాలు ఉండగా, మూడు ఏరియాల్లో బొగ్గు నిల్వలు అంతరించి పోతున్నాయి. అక్కడ నూతన గనుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉంది. లేనిపక్షంలో ఇల్లెందు, మణుగూరు, బెల్లంపల్లి ఏరియాలకు భవిష్యత్ లేకుండా పోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో నూతన గనుల కోసం ప్రయత్నాలు సాగించాల్సి ఉందని సింగరేణి భావిస్తోంది. ఇందుకోసం అటవీ అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
నష్టాల నివారణపై అధ్యయన కమిటీ
భూగర్భ గనుల్లోనూ నష్టాల నివారణపై ప్రత్యేక అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కంపెనీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శాంతిఖని, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టుల్లో న ష్టాల నివారణపై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. యంత్రాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిని అవసరమైతే విధుల్లోంచి తొలగించాలని సీఎండీ ఆదేశించారు. గైర్హాజరు శాతాన్ని గణనీయంగా తగ్గించాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. సింగరేణి సంస్థ ఒడిశాలో నూతనంగా ప్రారంభించిన నైనీ బ్లాక్లో బొగ్గు ఉత్పత్తి వేగవంతంపై దృష్టి సారించారు. సత్తుపల్లి వద్ద ఒక కోల్వాషరీ ఏర్పాటుపై కూడా ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించారు.
నూతన గనుల ఏర్పాటుపై దృష్టి
ఏరియాల జీఎంలకు బాధ్యతలు
కొత్త బొగ్గు గనులు రాకుంటే ఇల్లెందు, మణుగూరు, బెల్లంపల్లి ఏరియాలకు భవిష్యత్ ఉండదు. వాటికోసం అటవీ అనుమతుల ప్రక్రియ వేగంగా సాధించాలి. ఈబాధ్యతలను ఏరియా జీఎంలకు అప్పగించా లి. సంస్థ విస్తరణపై అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఇందుకు గల అవకాశాలపై అధ్యయనం చేయాలి.
– సింగరేణి యాజమాన్యం