
చేతులెత్తి వేడుకుంటున్నాం.. మా బడి మాకివ్వండి!
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం నియోజ కవర్గం బలిజిపేట మండలం పెదపెంకి గ్రామం దళితవాడలోని పెదపెంకి ఎంపీపీ–1 ప్రాథమిక పాఠశాల 3, 4, 5 తరగతులను వేరే మోడల్ పాఠ శాలలో విలీనం చేస్తూ కూటమి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు మొదలు పాఠశా ల పరిధిలో చదువుతున్న విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఆగిపోయింది. చదువు నిలిచిపోయింది. తమ దళితవాడలో 40 ఏళ్లకు పైగా కొనసాగుతూ వస్తున్న ప్రాథమిక పాఠశాలను తొలగించవద్దని ఇప్పటికే పలుమార్లు మండల అధికారులు, జిల్లా అధికారులకు తల్లిదండ్రులు గో డు వినిపించినా.. స్పందన లేకపోయింది. దీంతో గ్రామపెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలసి సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి జోరువానలోనూ నిరసన చేపట్టారు. పీజీఆర్ఎస్లో జిల్లా రెవెన్యూ అధికారిణి హేమలతకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ శాసనభ్యులు అలజంగి జోగారావు దృష్టికీ సమస్యను తీసుకెళ్లారు. తమ తరఫున పోరాడి, న్యాయం జరిగేలా చూడాల ని కోరారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడు తూ.. పేద విద్యార్థులకు చదువును దూరం చేయవద్దని కోరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్ష ణం స్పందించి వీరి పాఠశాలను యథావిధిగా కొనసాగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలసి మంత్రి లోకేశ్కు రెండు జోతులూ జోడించి, నమస్కరించి.. పాఠశాలను తరలించవద్దంటూ విజ్ఞప్తి చేశారు. మండల ఎంపీపీ గుడివాడ నాగమణి, సర్పంచ్ నగి రి పాపారావు, స్కూల్ కమిటీ చైర్మన్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.