● పీజీఆర్‌ఎస్‌కు 203 దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

● పీజీఆర్‌ఎస్‌కు 203 దరఖాస్తులు

Jun 24 2025 3:31 AM | Updated on Jun 24 2025 3:31 AM

● పీజీఆర్‌ఎస్‌కు 203 దరఖాస్తులు

● పీజీఆర్‌ఎస్‌కు 203 దరఖాస్తులు

పార్వతీపురం టౌన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులను పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత అన్నారు. స్థానిక కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు సుధారాణితో కలిసి అర్జీలు స్వీకరించారు. మొత్తం 203 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఫిర్యాదునూ మానవతాకోణంలో ఆలోచించి శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజనల్‌, మున్సిపల్‌ స్థాయిలో కూడా వినతులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాకారి కె.రాబర్ట్‌పాల్‌, డీఎంహెచ్‌ఓ ఎస్‌.భాస్కరరావు, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్‌ అధికారి ఓ.ప్రభాకరరావు, ఇన్‌చార్జ్‌ జిల్లా విద్యాశాఖధికారి బి.రాజ్‌కుమార్‌, పార్వతీపురం కో–ఆపరేటివ్‌ అధికారి, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..

● వీరఘట్టం మండలం యు.వెంకంపేటలో ప్రస్తుతం ఉన్న పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని, వర్షాకాలంలో శ్లాబ్‌ నుంచి నీరు లీకవడంతో విద్యార్థులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, అదనపు భవనం మంజూరు చేయాలని గ్రామానికి చెందిన ఎస్‌. సింహాచలం వినతి అందజేశారు.

● గుమ్మలక్ష్మీపురం మండలం పి.ఆమటి గ్రామంలో ప్రాథమిక పాఠశాల మూసి వేయడం వల్ల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని, వి ద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పాఠ శాలను పునఃప్రారంభించాలని తాడంగి దమ యంతమ్మ, తదితరులు వినతి సమర్పించారు.

● సర్వే నంబర్‌ 85–2లో ఉన్న భూమికి విద్యుత్‌ కనెక్షన్‌ పొందడానికి అవసరమైన రుసుం, సర్టిఫికెట్లను విద్యుత్‌ శాఖకు సమర్పించానని.. అయితే కొంతమంది కావాలనే పనిని అడ్డుకుంటున్నారని పార్వతీపురం మండలం డొంకలకోటపట్నం గ్రామానికి చెందిన డి.లక్ష్మి వినతి సమర్పించారు.

● గరుగుబిల్లి మండలం హిక్కింవలస గ్రామ పాఠశాలలో 3,4,5వ తరగతులు చదువుతున్న విద్యార్థులను గరుగుబిల్లి హైస్కూల్‌లో విలీనం చేయడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలోని పాఠశాలను మోడల్‌ ప్రై మరీ పాఠశాలగా మార్చి విద్యార్థులు స్థానికంగా చదువుకునేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement