
రోడ్డు ప్రమాదంలో హెచ్సీకి తీవ్ర గాయాలు
డెంకాడ: విజయనగరం – విశాఖ జాతీయ రహదారిపై మండలంలోని చింతలవలస ఐదో ఏపీఎస్పీ బెటాలియన్ మెయిన్ గేట్ వద్ద సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్, ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోరాడ రామునాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్సై ఎ.సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్సీ రామునాయుడు బెటాలియన్ మెయిన్ గేట్కు ఎదురుగా ఉన్న అయినాడ పంచాయతీలోని సత్యనారాయణపురం గ్రామంలో ఉంటున్నారు. సోమవారం 5.30 గంటల ప్రాంతంలో విధులు నిర్వహించేందుకు బెటాలియన్కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. విజయనగరం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రామునాయుడు తలకు, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సమీపంలో ఉన్న పోలీసులు వచ్చి రామునాయుడును విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. కొద్ది సేపటి తర్వాత కారును గుర్తించినట్లు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో హెచ్సీకి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో హెచ్సీకి తీవ్ర గాయాలు