
గుర్తు తెలియని మృతదేహం
బొబ్బిలి: తాడేపల్లి గూడెం పరిధిలో ట్రైన్ ఢీకొని ఓ గుర్తు తెలియిన వ్యక్తి మృతి చెందాడు. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మృతి చెందిన వ్యక్తి వద్ద నూజివీడు నుంచి బొబ్బిలికి కొనుగోలు చేసిన టికెట్ లభ్యం కావడంతో అక్కడి పోలీసులు బొబ్బిలి జీఆర్పీ సిబ్బందికి సమాచారం అందజేశారు. ఫొటోలను పంపించి ఆచూకీ కనుగొనాలని కోరడంతో స్థానిక జీఆర్పీ సిబ్బంది విలేకరులకు తెలియజేశారు. బొబ్బిలి లేదా పరిసర గ్రామాలకు చెందిన వ్యక్తి అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎవరైనా మృతుడిని గుర్తిస్తే బొబ్బిలి రైల్వే పోలీసులను పంప్రదిస్తే ఆ సమాచారి తాడేపల్లి గూడెం పంపించేందుకు అవకాశముంటుందని స్థానిక జీఆర్పీ సిబ్బంది తెలిపారు.